
మాజీ సీఎం వైయస్ జగన్ తో ఉమ్మడి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు మంగళవారం భేటీ అయ్యారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, తదితరులు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలను జగన్కు వివరించారు.