రాష్ట్రంలో రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 9,260 వాహనాలను ఏం చేస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. వీటి కోసం గత ప్రభుత్వం రూ.539 కోట్లు ఖర్చు చేసింది. దీంతో తాము అధికారంలోకి వస్తే వాటిని చెత్త తరలించే వాహనాలుగా మారుస్తామని TDP చెప్పింది. దాని ప్రకారం వీటిని చెత్త వాహనాలుగా మారుస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై మీ కామెంట్?