రవాణా శాఖ ద్వారా సీజ్ చేసిన వాహనాలకు యజమానులు అపరాధ రుసుము, ట్యాక్స్ బకాయిలు చెల్లించాలని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ మణికుమార్ కోరారు. సీజ్ చేసిన వాహనాలు విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాయని, ఇప్పటికే వాహన యజమానులకు నోటీసులు అందజేసినట్లు బుధవారం తెలిపారు. యజమానులు, ఫైనాన్షియర్లు ఈనెల 26వ తేదీ లోపు స్పందించాలని, లేకపోతే 27న వేలం వేసేందుకు నిర్ణయించామన్నారు. ఆసక్తి కలవారు వేలంలో పాల్గొనాలన్నారు.