A2Z सभी खबर सभी जिले की

||శివారు ప్రాంతాలపై నిఘాతో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలి||*

*-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,*

 

🌀 *దర్యాప్తులో ఉన్న గంజాయి, మిస్సింగు, ఎస్సీ ఎస్టీ, పోక్సో, ఎన్డీపిఎస్, క్రైం ఎగినిస్ట్ వుమన్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సమీక్షించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

🌀 *ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రముఖల విగ్రహాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ*

Related Articles

🌀 *విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ*

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మే 14న జిల్లా పోలీసు
కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నిర్వహించి, దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.ఎస్., పోక్సో, అట్రాసిటీ, లాంగ్ పెండింగు కేసులను సమీక్షించారు.

ఈ సందర్భంగా
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – శివారు ప్రాంతాల్లో నిఘా ఏర్పరిచి, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. 112/శక్తి యాప్ కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, సకాలంలో సంఘటనా స్థలంకు చేరుకొని, సమస్యలను పరిష్కరించాలన్నారు.
పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారి ఫిర్యాదులపట్ల సానుకూలంగా రిసెప్షన్ సిబ్బంది స్పందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాత్రి 11గంటల తరువాత సహేతుకరమైన కారణం లేకుండా
సంచరించే వారిపై టౌన్ న్యూసెన్సు కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గంజాయి
అక్రమ రవాణ నియంత్రణపై దృష్టి పెట్టాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్టులు వద్ద నిరంతరం
వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రౌడీలు, సస్పెక్ట్స్, ఇతర హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు మళ్ళీ నేరంకు పాల్పడకుండా కౌన్సిలింగు చేయాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. క్రొత్తగా ప్రారంభించిన హిస్టరీ షీట్లు వివరాలను సి.సి.టి.ఎన్.ఎస్.పోర్టల్లో నిక్షిప్తం చేయాలన్నారు. సైబరు మోసాలకు గురైనట్లు ఫిర్యాదులు వస్తే,
సంబంధిత పోలీసు స్టేషనుల్లో కేసులు నమోదు చేయాలన్నారు. వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగేందుకు
అవకాశం ఉన్నందున, నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎల్.హెచ్.ఎం.ఎస్. యాప్ గురించి అవగాహన కల్పించాలన్నారు. నేర నియంత్రణలో భాగంగా పోలీసు స్టేషనుకు పరిధి ప్రారంభం, ముగింపు ప్రాంతాల వద్ద స్టాపర్లును, బ్యారికేడ్లు, సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ-బీట్స్, ఈ-సాక్ష్య యాప్లను ప్రతీ
ఒక్కరూ వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పోలీసు స్టేషను పరిధిలో భూతగాదాలు కారణంగా
శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న అంశాలను గుర్తించి, ఎటువంటి వివాదాలు జరగకుండా ముందస్తు
చర్యలు చేపట్టాలని, నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోను నివసించే ఏక్టివ్ హిస్టరీ షీట్లు
కలిగిన వ్యక్తులను గుర్తించి, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల వద్ద, దేశ
ప్రముఖుల విగ్రహాలు వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. లేడిస్ హాస్టల్స్ వద్ద కాంపౌండ్, వాచ్మెన్, సిసి కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్లును ఆయా హాస్టల్స్ యజమాన్యం మెయింటెయిన్ చేసే విధంగా చూడాలన్నారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, రోడ్డు ప్రమాదాల్లోని హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందించేందుకు రెవెన్యూ అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఐటి కేసుల్లో ఫ్రీజ్
చేసిన నగదును కోర్టు అనుమతితో బాధితులకు అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్టీపిఎస్, మిస్సింగు,
194 బి.ఎన్.ఎస్. కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశా నిర్ధేశం చేసి, గ్రేవ్ కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

వివిధ పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించి, గంజాయి, చోరీలు నియంత్రించుటలోను, లోక్అదాలత్
లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయుటలోను, దర్యాప్తు కేసులను తగ్గించుటలోను, సిసిటిఎన్ఎస్ కేసుల వివరాలను
సకాలంలో అప్లోడ్ చేయుటలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్ఐలు, ఇతర పోలీసు
అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!