A2Z सभी खबर सभी जिले की

స్త్రీ శక్తి పథకం తొలి వారంలో 3 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణం

విజయనగరం జిల్లా లో స్త్రీ శక్తి పథకం ఆరంభించాక తొలివారం 3,26,939 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీమతి జి.వరలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేది న ఈ పథకం ప్రారంభం కాగా, 24 వ తేది వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్స్, ఎక్స్ప్రెస్ వంటి నాలుగు రకాల బస్సులలో మొత్తం 6,17,206 మంది ప్రయాణించారన్నారు వీరిలో మహిళలు 3,26,939 మంది కాగా టికెట్లు తీసుకుని ప్రయాణించిన పురుషులు 2,90,499 మంది ఉన్నారు ఈ విధంగా వారం రోజుల్లో కలిపి మహిళలకు రూపాయలు 1,22,56,345 మేరా ఈ పథకం ద్వారా లబ్ధి కలిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం ఆరంభమయ్యాక 04 రకాల బస్సుల్లో మహిళ ప్రయాణికులు క్రమంగా పెరుగుతుండగా పురుషుల సంఖ్య తగ్గుతుందని, గతంలో సగటున పురుష మహిళ ప్రయాణికుల నిష్పత్తి 65:35 గా ఉండేదని స్త్రీ శక్తి పథకం మొదలయ్యాక పురుష ప్రయాణికుల సంఖ్య 40% ఉండగా, మహిళా ప్రయాణికుల సంఖ్య 60% పెరిగినట్లు ఆమె తెలియజేశారు.

Show More
Check Also
Close
Back to top button