
తేదీ 06.05.2025. చీపురుపల్లి నియోజకవర్గం పీ.కే .పాలవలస పంచాయతీ కలి శెట్టిబడి గ్రామంలో
ఇటీవల వీచిన ఈదురు గాలులుకు . నష్టపోయిన అరటి మరియు బొప్పాయి పంటల రైతులను పరామర్శించిన విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వంని కోరడం జరిగింది. వెంటనే రైతులను ఆదుకోవాలని వారికి వెంటనే ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు సహాయ సహకారాలు వెంటనే అందించాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు, ఇప్పిలి అనంత గారు, వలి రెడ్డి శ్రీనివాసరావు గారు, మీసాల వరహాల నాయుడుగారు మరియు హార్టికల్చర్ సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.