A2Z सभी खबर सभी जिले की

నష్టపోయిన రైతులు పంటలను పరిశీలించిన జడ్పీ చైర్పర్సన్ చిన్న శ్రీను గారు

తేదీ 06.05.2025. చీపురుపల్లి నియోజకవర్గం పీ.కే .పాలవలస పంచాయతీ కలి శెట్టిబడి గ్రామంలో
ఇటీవల వీచిన ఈదురు గాలులుకు . నష్టపోయిన అరటి మరియు బొప్పాయి పంటల రైతులను పరామర్శించిన విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వంని కోరడం జరిగింది. వెంటనే రైతులను ఆదుకోవాలని వారికి వెంటనే ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు సహాయ సహకారాలు వెంటనే అందించాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు, ఇప్పిలి అనంత గారు, వలి రెడ్డి శ్రీనివాసరావు గారు, మీసాల వరహాల నాయుడుగారు మరియు హార్టికల్చర్ సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Check Also
Close
Back to top button
error: Content is protected !!