
జయనగరం ఏపీఎస్ ఆర్టీసీ డిపో పరిసర ప్రాంతాల ప్రయాణికుల కోసం బుధవారం డయల్ యువర్ డీపీటీవో
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రజా రవాణా అప్పలనారాయణ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ డైల్ యువర్ డీపీటీవో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులందరూ ఎటువంటి సమస్యలున్నా బస్సు రూట్లు, సమస్యలు, సలహాలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
ఫోన్ ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. సమస్యలపై డీపీటీవో ఫోన్ నంబర్ 9959225604 కు సంప్రదించాలన్నారు.