A2Z सभी खबर सभी जिले की

భారీ వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం (ఆగస్టు 18) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.

ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
అలాగే, వర్షాల కారణంగా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Related Articles
Back to top button
error: Content is protected !!