పరస్పర సహకారంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకును బలోపేతం చేద్దామని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం విజయనగరంలో వివిధ సహకార బ్యాంకుల మేనేజర్లు, సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో అవగాహన కల్పించి మార్చి నాటికి రూ.316 కోట్లు ఉన్న సహకార బ్యాంకు డిపాజిట్లను రూ.400 కోట్లకు, రూ.2,150 కోట్లతో ఉన్న బ్యాంకు పరిమాణాన్ని రూ.2,500 కోట్లకు పెంచడానికి కృషి చేద్దామన్నారు.
1 Less than a minute


