
విజయనగరం డీసీసీబీ ఛైర్మన్గా కిమిడి నాగార్జున ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. జిల్లా కేంద్రంలోని పూల్బాగ్ కాలనీలో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్రమంత్రి అశోక గజపతిరాజు, జిల్లాలోని ఎమ్మెల్యే లందరూ హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నాగార్జునకు అభినందనలు తెలియజేశారు.