
ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్, సమీర్లను 6 రోజులుగా చేస్తున్న విచారణ నేటితో ముగిసింది.
నిందితులను NIA, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్లు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సాయంత్రం భారీ పోలీసుల భద్రత మద్య జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు రిమాండ్ విధిస్తూ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయగా… విశాఖ సెంట్రల్ జైలుకు వారిని తరలించారు.