జిల్లా వైద్య, ఆరోగ్య శాలి కార్యాలయంలో DMHO జీవన రాణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. గర్భస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్దారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని తప్పక అమలు చేస్తామని కమిటీ సబ్యులు చెప్పారు.