
విజయనగరంలో వచ్చే నెల 1 ను౦డి ప్రతి రేషన్ షాపు వద్ద బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వ ప్రకటనపై కూర్మారావు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. పేదలకు ఉచితంగా అందించే బియ్యం పంపిణీలో ప్రధాని మోదీ ఫోటో ప్రతి డిపోలో ఏర్పాటు చేయాలనిశుక్రవారం డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో బియ్యం దారిమళ్లిందని ఆరోపించారు. ఈ-కేవైసీ ప్రక్రియ ద్వారా అర్హులకు మాత్రమే పంపిణీ జరుగుతుందని తెలిపారు.