
వేసవి సెలవుల్లో పిల్లల సరదా ప్రాణాలు తీస్తున్నాయి.
అప్పటివరకు సరదాగా ఆడుకుంటున్న వారు క్షణాల్లో ప్రమాదాల బారిన పడి విగతజీవులుగా మారుతున్నారు.
తాడేపల్లిగూడెంలో ఇద్దరు పిల్లలు జలాశయంలో, చిత్తూరు జిల్లాలో ముగ్గురు చిన్నారులు పొలంలోని నీటి గొయ్యిలో మునిగిపోయారు. విజయనగరంలో కారు డోర్ లాక్ అయి ఊపిరాడక నలుగురు పిల్లలు మృత్యు ఒడిలోకి చేరారు. ఈ సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని అనుక్షణం కనిపెడుతూ ఉండాలి.