
విజయనగరం జిల్లా ద్వారపూడిలో నలుగురు చిన్నారుల మృతి చెందడంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కారులో చిక్కుకుని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో చిన్నారుల కదలికలను ఓ కంట కనిపెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు.