
మెంటాడ, : మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జనరల్ పరిశీలనలో భాగంగా ఆసుపత్రినీ సందర్శించినట్లు డి ఎం & హెచ్ ఓ డాక్టర్ జీవనరాణి అన్నారు. మండల పరిధిలోగల వివిధ గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు డయేరియా నియంత్రణ విషయంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారో సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నార్మల్ డెలివరీ వివరాలు, గ్రామాలలో జరుగుతున్న శానిటేషన్ , క్లోరైజేషన్ తదితర విషయాలను క్షుణంగా పరిశీలించి సంబంధిత సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. రానున్న సీజనల్ వ్యాధుల దృశ్య గ్రామాలలో గల ప్రజాప్రతినిధులతోను, అధికారులతోను కలిసి పని చేయాలని సూచించారు. వేసవి కాల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి కావలసిన మెడికల్ కిట్లుతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాలలో ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆరోగ్య కేంద్రానికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్లు లోక్ ప్రియా, సి హెచ్ ఓ సత్యనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ మన్మధరావు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.