
🔸శ్రీ సాయికృష్ణా వాకర్స్ క్లబ్ & అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో..
🔸42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్న పేట జంక్షన్ వద్ద
శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ మరియు అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక అయ్యన్నపేట చెరువు ప్రక్కనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో క్వీన్స్ ఎన్.ఆర్.ఐ. హాస్పిటల్ వారి సౌజన్యంతో బి.పి.షుగర్ పరీక్షలను నిర్వహించారు.
ఈ సందర్భంగా క్లబ్ గౌరవ సలహాదారులు, ఎలక్ట్ గవర్నర్ ఎ. తిరుపతి రావు, క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్. ప్రకాశరావు మాష్టారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతీ ఒక్కరు తరుచుగా బి.పి, షుగర్ పరీక్షలను చేసుకోవాలని,ఆహార నియమాలను పాటించడం అవసరమని, ప్రజలంతా ఉప్పు వాడకాన్ని తగ్గించుకొని బిపి ను నియంత్రణలో ఉంచుకోవాలని, ఉదయాన్నే నడుస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచిస్తూ.. మనం బాగుంటే సమాజం బాగుంటుందని అన్నారు.
క్వీన్స్ ఎన్.ఆర్. ఐ, పి.ఆర్. ఒ. సి.హెచ్. మోహనరావు, టెక్నీషియన్లు కుమారి లిఖిత,ప్రసాద్ సేవలందించిన ఈ శిబిరంలో సుమారు వందమంది ప్రజలు వైద్య సేవలను వినియోగించు కున్నారు. శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ,కార్యదర్శి ఐ.వి ప్రసాదరావు కోశాధికారి ఆర్.సి.హెచ్. అప్పలనాయుడు,అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) క్లబ్ సభ్యులు భారీగా పాల్గొన్నారు.
~త్యాడ రామకృష్ణారావు(బాలు)