రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొన్నట్లు APSDMA వెల్లడించింది. రేపు చాలా జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలతోపాటు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడతాయంది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.