
గొల్లపల్లి దాడితల్లి సిరిమానోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. బొబ్బిలి జెండామాల్ జంక్షల్లో మంగళవారం రాత్రి 11.15 గంటల సమయంలో మీగడవీధికి చెందిన అంటిపేట జయరాం పైనుంచి రథం చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జయరాంను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించగా కాలు విరగడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.