A2Z सभी खबर सभी जिले की

విజయనగరం స్టేషన్లో బైక్లు / సైకిల్ పార్కింగ్ ఛార్జీల పెంపుదల తగ్గించాలని అభ్యర్ధన

విజయనగరం నుండి విశాఖపట్నం, బొబ్బిలి,పార్వతీపురం,శ్రీకాకుళం ప్రతిరోజు ప్రయాణించే ఎం. ఎస్. టీలు (కార్మికులు, విద్యార్థులు మరియు క్రింది స్థాయి మరియు మొదలగు ఉద్యోగులు) తమ వాహనాలు (బైక్లు/సైకిళ్లు) విజయనగరం రైల్వే స్టేషను ప్రాంగణంలోని పార్కింగ్ స్టాండ్ లో 2022 సంవత్సరం నుండి ఇప్పటివరకు బైక్/సైకిల్ కు పార్క్ చేసినందుకు రోజుకు రూ.02 నుండి రూ.05 మరియు నెలకు రూ.180/- చొప్పున చెల్లిస్తున్నాము.

ఇటీవల, పార్కింగ్ స్టాండ్ యజమాన్యం తేదీ 14-07-2025 నుండి బైక్ / సైకిల్కు రోజుకు రూ. 40/- నుండి 50/- మరియు నెలకు రూ. 900/- కు పించి, ఈ విషయాన్ని నోటీసు బోర్డు ద్వారా తెలియజేస్తూ పార్కింగ్ స్టాండ్ నందు పెట్టడం జరిగింది. ఒకేసారి 400% (శాతం) ఛార్జీల పెంపు చాలా అసహనీయమైనది మరియు అన్యాయమైనది. ఎం. ఎస్. టీ లో చాలా వరకు రోజు వారి వేతనం కి వెళ్ళేవారు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండటం వలన ఈ యొక్క పెంపుదల ఎం.ఎస్.టీలపై గణనీయమైన ఆర్థిక భారం అవుతుంది.

అందువల్ల, గౌరవనీయమైన DRM వారు, పార్కింగ్ ఛార్జీలను తగ్గించాలని మా వినతిని పరిగణించి, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎం.ఎస్.టీలు వారందరం కోరుతున్నాము.

Related Articles
Back to top button
error: Content is protected !!