
బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని విజయనగరంలోని బాబామెట్టలో గల హుజూర్ హజరత్ ఖాదర్ షా వారి దర్బార్ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సందర్శించారు. దర్బార్ ధర్మకర్త డాక్టర్ ఖలీల్ బాబు దర్భార్ సంప్రదాయం ప్రకారం ఎంపీకు సాదర స్వాగతం పలికారు. బాబా వారి శేష వస్త్రాలతో పాటు దుశ్శాలువ కప్పి సత్కరించారు. పవిత్ర పర్వదినం నాడు ఖాదర్ బాబా సన్నిధికి వచ్చి ఆయన ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.
