
బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద గంజాయితో నలుగురు పట్టుబడినట్లు ఎస్ఐ మహేశ్ శనివారం తెలిపారు. పట్టుబడిన వారిలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంకు చెందిన డొనక కీర్తి రాజ్ కుమార్, పోరాపు అమర్, మీసాల అఖిల్, తాడంగి రమేశ్ ఉన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జీఏవీ రమణ మీడియా సమావేశంలో వెల్లడించారు. వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.