A2Z सभी खबर सभी जिले की

వర్షాకాలంలో వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి….. డాక్టర్ లోకప్రియ

ప్రస్తుతం వాతావరణ మార్పులు ప్రతికూల పరిస్థితులు వలన దోమలు విస్తారమై ప్రజల్లో దోమ కాటు వలన అనేక భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందని వర్షాకాల ప్రారంభ దశలో దోమల వలన వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జె. లోకప్రియ అన్నారు. మెంటాడ పీహెచ్ పరిధిలో గిరిజన మైదాన గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో అవగాహన కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సీజనల్ డెంగ్యూ మలేరియా తో పాటు అనేక భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం చే పంపిణీ చేయబడిన దోమతెరలు ఉపయోగించుకోవాలని దోమల నుండి రక్షించుకునే వివిధ మార్గాలను అనుసరించాలని సూచనలు చేశారు. డాక్టర్ జి కల్పన మాట్లాడుతూ ప్రతివారం ఫ్రైడే డ్రై డేగా పాటించినప్పుడు కొంత మేరకు దోమలను నిర్మూలించగలమని వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా పాటించవలసిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఆశ వర్కర్లు స్థానిక మహిళ ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కలిపే విధంగా చర్యలు చేపట్టమని చెప్పారు. ఇంటి ముందు మురికి నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కనిపిస్తున్నారని ఆమె తెలిపారు. వర్షాకాలం కారణంగా డెంగ్యూ మలేరియా దోమలు ఉత్పత్తి కాకుండా పరిసరాలు పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. నీళ్లు మరిగించి చల్లార్చిన నీళ్లు తాగాలని వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిహెచ్ఓ సత్యనారాయణ హెచ్ వి జ్యోతి యు డి సి స్వామి ల్యాబ్ టెక్నీషియన్ మన్మధరావు ఏఎన్ఎంలు ఎంఎల్ హెచ్ వీలు ఆశా వర్కర్లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!