A2Z सभी खबर सभी जिले की

*జిల్లాలో అనుమతులు లేకుండా విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలి – SFI

JC సేతు మాధవన్ గారిని కలిసి వినతి పత్రం అందించిన SFI నాయకులు

  • జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల బోర్డులను విద్యా శాఖాధికారులు తొలగించాలని SFI నాయకులు కోరారు. సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు m వెంకీ, J రవికుమార్ మాట్లాడుతూ మరో 4 నాలుగు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని , కానీ విద్య పేరుతో వ్యాపారం మాత్రం ముందే మొదలయిపోయిందని విమర్శించారు. రాజాం మండలంలో ఉన్న అభ్యాస్ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా ఇంటర్నేషనల్ అనే బోర్డు ఏర్పాటు చేశారని , ఆ విధంగా తల్లి తండ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజాం మండలం లోనే ఉన్న నారాయణ కార్పొరేట్ పాఠశాలలో కూడా ఎటువంటి అనుమతులు లేకుండా E – Techno బోర్డు ఏర్పాటు చేసి ఆ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం పట్టణంలో గల ఆదిత్య జూనియర్ కళాశాలకు అనుమతులు లేకున్నా సరే కాకినాడ ఆదిత్య అని పెట్టారని తెలిపారు. ఇలా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్డు ల పేరుతో ఆ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున తల్లి తండ్రుల నుండి వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నారని విమర్శించారు.  తక్షణమే జిల్లా విద్యా శాఖాధికారులు ఇలాంటి విద్యా సంస్థల పై చర్యలు తీసుకొని బోర్డులను తొలగించాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షం లో జరిగే ఆందోళనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గారు తక్షణమే బోర్డులను తొలగించాలని విద్యా శాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చారని , విద్యా శాఖ అధికారులు ఆ విధంగా కృషి చేయాలని కోరారు. JC గారిని కలిసి వారిలో SFI జిల్లా సహాయ కార్యదర్శులు P రమేష్, S సమీరా తదితరులు ఉన్నారు.

Back to top button
error: Content is protected !!