
ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్, సమీర్లను NIA మూడు రోజులుగా విచారిస్తోంది. ఈ క్రమంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
నిందితులు ఏడేళ్లుగా హైదరాబాద్లో మకాం వేసి హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగుళూరు, ముంబయిలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతో వరంగల్కు చెందిన ఫర్హాన్ మోయినుద్దిన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.