
సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టి కుల, మత, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 30న హెచ్చరించారు.
సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ మతాలను, కులాలను, రాజకీయ పార్టీలను రెచ్చగొడుతూ వ్యక్తిత్వ హననంకు పాల్పడుతూ ట్విట్టరు, ఫేస్ బుక్, ఇనస్టాగ్రాం, యూట్యూబు, టెలిగ్రాం, వాట్సాప్, లింకిడిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాల, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిత్వ హననంకు పాల్పడుతూ శాంతిభద్రతలకు
విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టిందన్నారు. ఇందుకుగాను ఒక పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
డెంకాడ మండలం టి.కల్లాలు (చిన మోపాడ) లోగల క్రైస్తవ చర్చి ఆవరణంలోగల యేసు క్రీస్తు విగ్రహంపై
ఒక చెట్టు కొమ్మ పడిపోవడం వలన విగ్రహం పాడైపోతే, వాస్తవం తెలుసుకోకుండా శ్రీ గోపీనాధం సాంస్కృతిక సేవా సంస్ధ అధ్యక్షులు నాడిశెట్టి శాంతారావు అనే వ్యక్తి సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టు పెట్టడంతో అతడిపై డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి, అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
తెలిపారు.
ప్రజలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ అయిన ట్విట్టరు, యూట్యూబు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రాం, లింర్డిన్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నవారు విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. వాస్తవాలను
తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టేటపుడు ఇతరుల మతాలు, కులాలు, మనోభావాలకు, వ్యక్తిత్వానికి
భంగం కలిగించకుండా ఉండాలన్నారు. పోస్టుల్లో వాస్తవాలను వక్రీకరించడం, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు చేయడం వలన ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయన్న వాస్తవాన్ని ప్రతీఒక్కరూ గమనించాలన్నారు.
యువత, ప్రజలు సోషల్ మీడియాను పాజిటివ్ కోణంలో వినియోగించుకొని, సాంకేతికతను అందిపుచ్చుకొని,
నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నామని ఇతరులచే గుర్తింపుకు
విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నెటిజనులను హెచ్చరించారు.