
ఆ రూట్లో స్వల్పంగా తగ్గిన ఆర్టీసీ బస్ టికెట్ ధరలు
విజయనగరం నుండి ఎస్ కోట వయా ధర్మవరం మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరలు తగ్గించడం జరిగిందని ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పత్రిక ప్రకటనలో తెలిపారు
ఇదివరకు విజయనగరం నుండి ఎస్ కోట వెళ్లే ప్రయాణికులకు రూ.55/-ల నుండి రూ.50/-లకు టికెట్ ధర తగ్గించడం జరిగింది మరియు కొన్ని స్టేజీలలో టికెట్ ధర స్వల్పంగా తగ్గడం జరిగింది. . కావున ప్రయాణికులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని కోరారు.