A2Z सभी खबर सभी जिले की

నిండుకుండలా తోటపల్లి జలాశయం

గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయంలో శనివారం 104.10 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. రిజర్వాయర్‌ సామర్థ్యం 2.534 టీఎంసీల కాగా.. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రస్తుతం 1.963 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 3,241 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలో చేరుతుందని చెప్పారు. మరిన్ని వర్షాలు కురిసి నీటిమట్టం పెరిగితే రెగ్యులేటర్‌ గేట్లుఎత్తి దిగువకు విడిచిపెట్టే అవకాశం ఉందన్నారు.   

Back to top button
error: Content is protected !!