A2Z सभी खबर सभी जिले की

ఆరోగ్యాంధ్రగా చేయడమే లక్ష్యం

యోగా శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీఓ..ఎ.బానుమూర్తి

ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంధ్రగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీఓ భానుమూర్తి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన మెంటాడలోని స్థానిక సచివాలయం నందు సచివాలయ సిబ్బందికి యోగా శిక్షణా కార్యక్రమం జరిగింది. మండలంలోని జక్కువ పిట్టాడ బడేవలస మెంటాడ గ్రామాల్లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీడీఓ భానుమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ యోగా మానవునికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన శరీరానికి, ఒత్తిడి నుంచి ఉపశమనానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. యోగా ద్వారా అంతర్గత సామరస్యాన్ని కనుగొనడం, ప్రశాంతమైన మనస్సు, మానసిక స్పష్టత, ఏకాగ్రత వంటివి మనిషికి కలుగుతుందని తెలిపారు. శిక్షణ పొందిన సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల్లోని ప్రజలకు యోగా పట్ల శిక్షణ, అవగాహన కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు వ్యాయామ ఉపాధ్యాయులు మేడమ్ పార్వతి పంచాయతీ సెక్రెటరీలుజి. కృష్ణ, సింహాచలం,రాము ఏఎన్ఎంలు మహిళా పోలీసులు ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!