
విజయనగరం పట్టణంలో ఈనెల 23న పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఈఈ త్రినాథరావు తెలిపారు.
బుచ్చెన్నకోనేరు సబ్ స్టేషన్ పరిధిలో ఫీడర్ పై ఉన్న చెట్టు కొమ్మలను తొలగింపు పనులు చేపడుతున్నామన్నారు.
దీంతో వైఎస్ఆర్ నగర్, బీటీఆర్ కాలనీ, సత్యనగర్, రాళ్లవీధి, గాజులరేగ, కొత్తవీధి, బుచ్చెన్నకోనేరు దక్షిణ రోడ్డు ప్రాంతాలకు ఉ.8 నుంచి 1 గంట వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.