జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని JC సేతు మాధవన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 19న బొబ్బిలి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక, కొత్తవలస మండల పరిషత్ కో-ఆప్షన్ మెంబర్ ఎన్నిక, గరివిడి మండలం సేరిపేట ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశించారు.