A2Z सभी खबर सभी जिले की

బావిలో పడి మహిళ మృతి

రాజాంలోని గాయత్రీ కాలనీకి చెందిన పి.కుమారి(45) నాలుగేళ్ల క్రితం తన రెండవ కుమారుడు మరణించడంతో మానసికంగా కృంగిపోయింది.
అప్పటి నుంచి ఆమెకు కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 20న శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు.
అదే రోజు రాత్రి బయటికి వెళ్ళిన ఆమె తెలగ వీధిలోని నేలబావిలో పడి మృతి చెందింది. కుమారుడు సాయితేజ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై రవికిరణ్‌ కేసు నమోదు చేశారు.

Back to top button
error: Content is protected !!