“ఎస్‌ఎఫ్‌ఐ ప్లీనరీ సమావేశంలో 12 తీర్మానాలకు ఆమోదం”

రెండు రోజులు పాటు జిల్లా కేంద్రంలో జరిగిన విద్యార్థి ఉద్యమ వేగుచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఘనంగా ముగిశాయి. రెండవ రోజు సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిందని కానీ ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని విమర్శించారు. సంవత్సర కాలం పాటు సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వానికి గడువు ఇచ్చామని ఆ సమస్యలు తీరకపోవడంతో ఈ ప్లీనరీ సమావేశాల స్ఫూర్తితో ఉద్యమాలు రూపొందిస్తామని హెచ్చరించారు. రాబోయే కాలం పోరాటాల కాలమని ఎస్ఎఫ్ఐ నాయకత్వన విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించాలని కోరారు. విద్యను కార్పొరేటీకరణ చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ,కేరళ తరహా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ పాలసీ ని డెవలప్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశాల్లో పలు తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించారు.

తీర్మానాలు:

1)డిగ్రీలో ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్లైన్లోనే అడ్మిషన్ నిర్వహించాలి డబల్ మేజర్ విధానాన్ని కొనసాగించలి.
2) రాజాం గజపతినగరం విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలి
3) జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
4) 107 108 జీవాలను రద్దుచేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల అమ్మకాన్ని ఆపాలి.
5) విజయనగరం జిల్లా వ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టల్ కు సొంతభవనాలు నిర్మించాలి
6) ఇటువంటి షరతులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం 15000 రూపాయలు ఇవ్వాలి
7) సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కి నిధులు కేటాయించి నిర్మాణాలు వేగవంతం చేయాలి విద్యార్థులకు హాస్టల్ ,ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.
8) జీవో నెంబర్ 19 20 21 లను రద్దుచేసి పాఠశాల విలీనాన్ని ఆపాలి.
9) అమ్మాయిల సంక్షేమ హాస్టల్లో శానిటరీ ఆఫీస్ ఉచితంగా అందించాలి
10) బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్ ,డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి
అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేషులు మాట్లాడుతూ జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్లీనరీ సమావేశాలు స్ఫూర్తి తో పోరాటం సాగిస్తామని ప్రభుత్వం చొరవ చూపించి సమస్యలు పరిష్కారం చేయని యెడల విద్యార్థుల పోరాటాన్ని చెవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి చిన్నబాబు, J రవికుమార్,ఎస్ సమీరా, ఎం వెంకీ ,పి రమేష్, కె రమేష్ జిల్లా సహాయ కార్యదర్శులు ఆర్ శిరీష , S సోమేష్,ఈ వంశీ, కే రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version