ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా గంట్లశ్రీనుబాబు

ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక, ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్, ఇండియా ఏ హెడ్ జాతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా పదోన్నతి కల్పిస్తూ ఆంధ్రప్రభ గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రభ గ్రూప్ లో ఉమ్మడి విశాఖ బ్యూరోగా సేవలందిస్తున్న గంట్లశ్రీనుబాబు ఇక మీదట ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన న్యూస్ కో ఆర్డినేటర్ గా పదోన్నతిపై తన సేవలు కొనసాగించనున్నారు. 1997లో సింహాచలం గ్రామీణ ప్రాంత విలేకరిగా పత్రికా రంగంలో అడుగుపెట్టిన గంట్ల శ్రీనుబాబు తొలుత,*సూర్యప్రభలో* రిపోర్టర్, స్టాఫ్ రిపోర్టర్ గా ఆ తరువాత 15 ఏళ్లుపాటు,*ఆంధ్రజ్యోతిలో* రిపోర్టర్ గా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహించారు. ఆ తరువాత పదేళ్లుగా ఆంధ్రప్రభలో బ్యూరో చీఫ్ గా కొనసాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే తనకు పదోన్నతి కల్పించిన గౌరవ ఎండి గౌతమ్ గారికి, న్యూస్ నెట్ వర్క్ కో ఆర్డినేటర్ , ఈడి పి.భాస్కర్ గారికి, ఉభయ రాష్ర్టాల జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్వలు గారికి, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ఎడిటర్లు గౌరవ శర్మగారు, దిన్షాబాబు గారికి , తనతో పాటు విధులు నిర్వహిస్తున్న స్టేట్ బ్యూరోలో మిత్రులు, ఉత్తరాంధ్ర మిత్రులు, ఆంధ్రప్రభ యాజమాన్యానికి గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న కాలం లో కూడా మీ సహకారం ఇలాగే అందించాలని కోరుకుంటూ
సింహాద్రినాధుడి ఆశీస్సులతో
మీ గంట్ల శ్రీనుబాబు

Exit mobile version