బొబ్బిలి గ్రోత్ సెంటర్లోని ఓ కనస్ట్రక్షన్ కంపెనీలోని వాచ్మెన్గా పనిచేసిన కె.వెంకటరమణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకటరమణ కుమార్తెతో పాత బొబ్బిలికి చెందిన కె.సర్వేశ్వరరావుకు వివాహాతర సంబధం ఉంది. ఈ విషయం తండ్రికి తెలియడంతో సర్వేశ్వరరావును మందిలించాడు. ఎలాగైనా వెంకటరమణ అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో డ్యూటీ చేస్తున్న సమయంలో దాడి చేసి చంపినట్లు డీఎస్పీ రాఘవులు వెల్లడించారు.