ఒడిశా రాష్ట్రంలో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ. పూరి జగన్నాధుని రథ యాత్రకు భక్తుల సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వారు ఈ నెల 26న సాయంత్రం 04.00గం. లకు బయలుదేరి భువనేశ్వర్, కోణార్క్ మరియు పూరి ఆలయాలను దర్శించుకొని తిరిగి 28.06.2025 నాడు ఉదయం 06.00గం. లకు చేరుకొనే విధముగా ప్రత్యేక సూపర్ లగ్జరీలు బస్సులు నడపనున్నామని డిపో మేనేజర్ శ్రీనివాసరావు నేడు పత్రిక ప్రకటనలు తెలిపారు.
టికెట్ ధర రు.2500/- రిజర్వేషన్ కొరకు కొరకు www.apsrtconline.in అనే వెబ్ సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొనే సదుపాయము కల్పించబడినది. ప్రయాణికులు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు9959225620,9494331213,9440359596 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.