APRSA నూతన కార్యవర్గం ఎన్నిక

పట్టణంలోని స్థానిక రెవెన్యూ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికను ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా తాడి గోవింద, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా శ్రీనివాసరావు, వైస్‌ ప్రెసిడెంట్లుగా ఆదిలక్ష్మి, జగన్నాధరావు, కృష్ణ కుమార్‌, శంకర్రావు, కార్యదర్శిగా సూర్యనారాయణ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా సంజీవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గానికి రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version