విజయనగరం జిల్లాలో కొవిడ్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు.
తన ఛాంబర్లో వైద్యాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొవిడ్ పరీక్షలకు శాంపిల్స్ను విశాఖపట్నం పంపించడంతో రిజల్ట్ వచ్చేసరికి ఆలస్యం అవుతోందన్నారు. జిల్లాలోనే రాపిడ్ టెస్ట్లు చేయడానికి అవసరమయ్యే పరికరాలను రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.