కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలు 1995, 1998 చట్టాలను పునరుద్ధరించాలని, వృత్తి ప్రమాణాలను, వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలోన స్థానిక కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చట్టాల రద్దు పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ పెద్దపెటున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనాల చెల్లింపుకు, ఇతర సదుపాయాలకు, వేతన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టులకు ఏర్పాటును అందించే 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు వస్తావనకు రాకుండా పోతాయన్నారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు యాజమాన్యాల నుంచి చట్టబద్ధమైన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉన్న ఈ రెండు చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కోరుతోందన్నారు. మొత్తం మీడియాను ఒకే చట్ట పరిధిలోకి తెచ్చే విధంగా సరికొత్త చట్టాలు రూపొందించాల్సింది పోయి ఉన్న చట్టాలను రద్దు చేయడం ఎంత మాత్రం సరైన కాదని కాదన్నారు. రాష్ట్రవ్యాప్త ఎరుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. మురళి శంకర్రావు పతివాడ అప్పారావు బి.ప్రసాదరావు, గొర్లె సూరిబాబు తదితరులు పాల్గొన్నారు