కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుతో డీసీసీబీ ఛైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున సోమవారం భేటీ అయ్యారు. స్థానిక అశోక్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు సంబంధించి పలు విషయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర రావు, టీడీపీ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కలిదిండి పాణిరాజు, తదితరులు పాల్గ్న్నారు.