ఇద్దరు గంజాయి పెడ్లర్స్ అరెస్టు

- విజయనగరం జిల్లా వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్

విజయనగరం పట్టణం రామానాయుడు రోడ్డులో కొంతమంది వ్యక్తులు గంజాయి
సేవిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆదేశాలతో వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బంది జూన్ 2న రైడ్స్ నిర్వహించారు
ఈ రైడ్స్ లో గంజాయి
సేవిస్తూ, విక్రయాలకు పాల్పడుతున్న (A-1) విజయనగరం వుడా కాలనీకి చెందిన వజ్జల భరత్ కుమార్ (32 సం.లు), (A-2) లంకాపట్నంకు చెందిన చిన్న మనోహర్ (26 సం.లు) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 375 గ్రాముల గంజాయి, రూ.350/- ల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. నిందితులు గంజాయిని చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్నట్లుగా విచారణలో అంగీకరించారు.

 

Exit mobile version