బంగాళాఖాతంలో అల్పపీడనం హెచ్చరికల నేపథ్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం ఆదేశించారు. ఈనెల 27న 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్ని మండలాలు డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.