రెండు వర్గాల కొట్లాట..సర్పంచ్‌కు గాయాలు…

నెల్లిమర్ల మండలం కొత్తపీటలో చెరువు నుంచి మట్టి తరలించే విషయంలో గురువారం రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఆ గ్రామ సర్పంచ్‌ శ్రీనుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకో వర్గం వాళ్లు కూడా స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. పరస్పర ఫిర్యాదులతో ఇరువర్గాలఫై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గణేశ్‌ తెలిపారు.

Exit mobile version