*డాక్టర్. రెడ్డి సత్యారావు స్మారక గ్రంథాలయం ప్రారంభం *

జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో కె. ఎల్. పురంలో గల లక్ష్మి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో విజయనగరం మొట్ట మొదటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డి సత్యారావు జ్ఞాపకార్ధం గ్రంథాలయాన్ని సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు ప్రారంభించి పుస్తకాలను అందజేశారు. అనంతరం గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి, సంఘ సభ్యులతో కలిసి రెడ్డి సత్యారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రెడ్డి సత్యారావు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా విశేష కృషి చేసారని వారి పేరు మీద గ్రంథాలయం ప్రారంభించడం సంతోషమని అన్నారు. విద్యార్థులంతా గ్రంథాలయంలో వున్న పుస్తకాలను చదవాలని, పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం ఇప్పటినుండే అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు బి. రామభద్రరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి లక్ష్మీ, గ్రంథాలయ సంఘం వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, అధ్యక్షులు కె. ఎర్నాయుడు, ఉపాధ్యక్షులు కె. దయానంద్, లక్ష్మి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ వీరాస్వామి, కర్రోతు సత్యం, ప్రియా, విద్యార్థులు పాల్గొన్నారు

Exit mobile version