విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ
పి.సౌమ్యలత మే 19, సోమవారం నాడు నిర్వహించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి అదనపు ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికాతులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు.
పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీగారు 35 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించి
న ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 12, కుటుంబ కలహాలకు సంబంధించినవి 6, మోసాలకు పాల్పడినట్లు 3,ఇతర అంశాలకు సంబంధించినవి 14 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను
పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు
చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను అదనపు ఎస్పీ ఆదేశించారు.
“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, 7దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు
చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి
పంపాలని సంబంధిత పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, డిసిఆర్బి సిఐ బి.సుధాకర్, ఎస్ఐ రాజేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.