కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదు: బొత్స

తప్పుడు కేసులతో అధికారులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వానికి హితవు పలికారు.
కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేసులు పెడితే పరిస్థితేంటని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వ పెద్దలు వీధుల్లో చెత్తనూ తొలగించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయలేక ప్రస్ట్రేషన్‌లో ఉన్నారని విమర్శించారు.

Exit mobile version