బీట్ ది హీట్ కార్యక్రమం ద్వారా ఉష్ణతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలను చేపడుతున్నామని శుక్రవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య వెల్లడించారు. అనేక ప్రాంతాలలో పక్షుల కోసం మట్టి పాత్రల్లో, పశువుల కోసం నీటి తొట్టెల్లో నీటిని సిద్ధం చేశామన్నారు. వాహన శోధకులు ఎండతీవ్రతకు ఇబ్బంది పడకుండా హరిత కూడళ్ల పేరుతో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద షెటెడ్ నెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.