CSR నిధులతో 40 చెరువులు అభివృద్ది: కలెక్టర్‌

విజయనగరం జిల్లాలోని చంపావతి నదీపరీవాహక ప్రాంతంలో CSR నిధులతో 40 చెరువుల పునరుద్దరణకు ప్రణాళికను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ధాన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ తమ ఛాంబర్‌లో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. యాక్సిస్‌ బ్యాంక్‌ CSR నిధులతో ధాన్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ పనులు జరుగుతాయన్నారు.

Exit mobile version