ఏసీబీకి చిక్కిన వీఆర్వో

జామి మండలంలోని అలమండ వీఆర్వోగా పనిచేస్తున్న వేణు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అప్పలనాయుడు అనే రైతుకు పట్టాదారు పాస్‌ పుస్తకం మ్యూటేషన్‌ నిమిత్తం వీఆర్వో రూ.15వేలు లంచం డిమాండ్‌ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version