ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం


విజయనగరం మే12: స్థానిక కొత్త గవరవీధి రామమందిరం వద్ద హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాదు వారిచే ఉచిత ఆరోగ్య పరీక్షల అవగాహనా శిబిరం ఏర్పాటు చేయబడింది. శిబిరాన్ని 22వ డివిజన్ కార్పొరేటర్ బవిరి సతీష్, శ్రీమతి కాసులమ్మ
ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్నవారికి కంప్యూటరైజ్డు నాడీతరంగిణీ పద్దతిలో పరీక్షలు జరిపి శరీరానికి సంభవించబోయే రోగాల గురించి ముందుగా తెలియజేయడం జరిగింది. అవసరమైన వారికి ఆయుష్మాన్ అనుమతించిన కొన్ని మందులను సూచించారు. ఆలయ నిర్వాహకుడు నాయుడు, సీనియర్ సిటిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version